9, ఫిబ్రవరి 2018, శుక్రవారం

స్పటిక శివలింగం

స్పటిక శివలింగం 

స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. శివుని శరీరము “ శుద్ధస్ఫటిక సంకాశం ” అని కీర్తింపబడింది. సాక్షాత్తు శివ స్వరూపమైన స్ఫటిక లింగాన్ని ఆరాధించి సేవిస్తే ముక్తి లభిస్తుందని శాస్త్రాలలో పేర్కొనబడింది. శివారాధన వికల్పాలలో విభిన్న వ్యక్తులు విభిన్న శివలింగాలని మాత్రమే పూజించాలని పురాణాలలో ప్రతిపాదిస్తూ స్పటిక లింగాన్ని మాత్రం స్త్రీ పురుష భేదం లేకుండా అందరు సేవించి పరమపదమును పొందవచ్చునని నిరూపింపబడింది. 

 స్పటిక శివలింగం అత్యంత విశేషమైనదిగా చెప్పబడుతోంది. కొన్ని శివలింగాలను పూజించడం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం, మోక్షం లభిస్తుంటాయి. ఇక స్పటిక శివలింగం దగ్గరికి వచ్చేసరికి దానికి ఒక ప్రత్యేకత వుందని చెబుతుంటారు. ఫలానా కోరిక నెరవేరాలని సంకల్పించుకుని, దానిని అర్చించడం వలన మనసులోని ఆ కోరికలు అనతికాలంలోనే నెరవేరతాయని చెప్పబడుతోంది. స్పటిక లింగం పరబ్రహ్మానికి చిహ్నం. తురీయమైన శివానికి అది గుర్తు. 

శంకరాచార్యుల వారు కైలాసం వెళ్ళి అయిదు స్పటిక లింగాలను తెచ్చారు. మార్కండేయ సరిహతలో ఆ లింగాలను ఎక్కడెక్కడ ప్రతిష్ఠించిందీ వివరించబడింది. 

"శివలింగం ప్రతిష్ఠాప్య చిదంబర సభాతటే మోక్షదం సర్వజంతూనాం భువనత్రయసుందరం ముక్తిలింగం తు కేదారే నీలకంఠే వరేశ్వరం కాంచ్యాం శ్రీకామకోటే తు యోగలింగ మనుత్తరం శ్రీ శారదాఖ్యపీఠేతు లింగం తం భోగనామకం" కేదారంలో ముక్తి లింగాన్ని, నేపాల్ లో గల నీలకంఠ క్షేత్రంలో వరలింగాన్ని, చిదంబర క్షేత్రంలో కనక సభలో మోక్షలింగాన్ని, శృంగేరీ శారదాపీఠంలో భోగలింగాన్ని, కాంచి కామకోటి పీఠంలో యోగలింగాన్ని ప్రతిష్ఠించటం జరిగిందని మార్కండేయ సరిహత చెబుతోంది. 

శివమయం జగత్. ఈ విశాల విశ్వంలో శివుడు కానిది ఏదీలేదు. శివశబ్దమే కల్యాణకారకం అని అర్థం. శివుడు సకల జగాలకు పాలకుడు. దిక్కులనే అంబరాలు ధరించినవాడు. శివుడు భక్తసులభుడు. ‘హర హర మహాదేవ శంభో’అన్నంతనే నేనున్నా నంటూ భక్తులను బ్రోచే భక్తవశంకరుడు. జడమైన జగతికి చైతన్యాన్ని ప్రసాదించే లయకారుడు. మాయానాశకుని ఉదంతాన్ని తెలియచేయడానికే లింగోద్భవం జరిగిందంటారు. 

స్పటిక లింగాన్ని ప్రధమం మహాశివరాత్రి రోజుగాని, శుక్రవారం లేదా సోమ వారం రోజుగాని పూజా మందిరంలో ప్రతిష్టించి అభిషేకించటం మంచిది. జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు దోష నివారణకు స్పటిక లింగాన్ని అభిషేకించటం మంచిది. రవి, శుక్ర గ్రహాలు కలసి 10 డిగ్రీల లోపు ఉన్నప్పుడూ అస్తంగత్వ దోషం ఏర్పడుతుంది. ఇలాంటి దోష నివారణకు రవికి అధి దైవం అయిన శివస్వరూపమైన శివలింగాన్ని, శుక్ర గ్రహానికి చెందిన రత్నమైన స్పటికాన్ని శివలింగ రూపంలో అభిషేకించి అభిషేక తీర్ధాన్ని స్వీకరించటం ద్వారా అస్తంగత్వ దోష ప్రభావం నుండి విముక్తి కలుగుతుంది. 

వివాహ విషయంలో కలిగే ఆటంకాలను తొలగిస్తుంది. ప్రతి నిత్యం స్పటిక శివ లింగానికి అభిషేకించే వారికి వైవాహిక జీవితంలోని సమస్యలను తొలగిస్తుంది. స్పటిక లింగానికి అభిషేకించిన అభిషేక తీర్ధాన్ని స్వీకరించిన వారికి స్ఫురణ శక్తి పెరుగుతుంది. వ్యాపార స్ధలంలో ఉంచి స్పటిక లింగానికి అభిషేకించటం వలన వ్యాపారాభివృద్ధి, ఆర్ధికాభివృద్ధి, మంచి తెలివితేటలు, మంచి వాక్ శుద్ధి, నరదృష్టి ప్రభావం తొలగి జనాకర్షణ కలుగుతుంది.

2 కామెంట్‌లు:

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...