10, ఫిబ్రవరి 2018, శనివారం

నర్మదా బాణలింగం

నర్మదా బాణలింగం 

పురాణాల ప్రకారం నర్మద శివాంశసంభూతురాలని, చంద్రవంశ రాజుకు భార్య అయి నందున ‘సోమోద్భవ’ అని, నాగులకు గంధర్వుల బాధ తొలగించి నందున "నాగకన్య" అని కొన్ని పేర్లతో పిలవబడుతుంది. నాగులకు ఉపకారం చేసినందులకు నర్మద యందలి లభించు బాణ లింగాలకు అభిషేకం చేసిన జలాలు సేవించిన వారికి కాలసర్ప విష భయం ఉండదని నాగులు వరమిచ్చారు. ఈనర్మదా బాణలింగ అభిషేక జలం త్రిదోషహరం, వీర్యవృద్ధి కరం, ఆరోగ్యకరం, రుచికరమని ఆయుర్వేద గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. నర్మదా లింగాన్ని చూచినంత మాత్రముననే కాలసర్పదోషాలు, నాగదోషాలు, సమస్త పాపములు నశించునని పురాణములు ప్రకారం నాగదేవతలు వరం ప్రసాదిస్తున్నవి. 

బాణలింగ పూజ వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆధునిక కాలంలో నిర్మిస్తున్న శివాలయాలలో చాలావరకు బాణలింగాలనే ప్రతిష్ఠ చేస్తూ వస్తున్నారు. బాణ లింగాలు గుడ్డు ఆకారంలో ఎంతో నున్నగా వుంటాయి. ఎంత తేనే పోస్తే అంత ఎత్తుకునేంతగా బాణలింగాలు కనిపిస్తుంటాయి. ఏ విధమైన ఎగుడు దిగుడు లేకుండా ఒకే విధమైన కోణాలను కలిగి, ఆకర్షణీయంగా కనిపించడం బాణలింగం ప్రత్యేకత. ఇవి తెలుపు, నలుపు, నేరేడు పండు, తేనే, గచ్ఛ కాయ రంగుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. 

బాణలింగాలు ఎక్కువగా నర్మదా నదీ ప్రాంతంలో మాత్రమే ఎక్కువగా లభిస్తూ వుంటాయి. నర్మదా బాణ లింగ రూపంలో ఉన్న శివుణ్ణి ఇంద్రాది దేవతలు, రావణాది రాక్షసులు పూజించారు. నర్మదా నదీతీరంలో కూర్చుని పూర్వం బాణాసురుడు తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం కాగానే ఈ పర్వతంలో ఈ నదిలో నీవు నాకెప్పుడూ దర్శనం ఇవ్వాలని వరం కోరతాడు. బాణుడు కోర్కెను తీర్చడానికి భగవానుడు గుండ్రని లింగాకృతి గల రాళ్ళ రూపంలో మారిపోయాడు. అందుకే “నర్మదాకే శంకర్ సబ్ కే శంకర్” అనే సామెత వచ్చింది. బాణాసురుడికి ఇచ్చిన వరం ప్రకారం శివుడు ఇక్కడ లింగ రూపాల్లో లభిస్తూ ఉంటాడనీ, ఈ కారణంగానే వీటికి బాణలింగం అనే పేరువచ్చిందని అంటారు. 

మట్టి, స్పటికం, బంగారం, వెండి తదితర శివలింగాలను పూజించడం వలన కలిగే పుణ్యఫలం, ఒక్క నర్మదా బాణ లింగాన్ని పూజించడం వలన లభిస్తుందని చెప్పబడుతోంది. నర్మదా బాణలింగాన్ని ఆరాధించడం వలన సకల శుభాలు చేకూరతాయనీ, సుఖ సంతోషాలు కలుగుతాయని స్పష్టం చేయబడుతోంది. సాలగ్రామములు ఏ విధంగా పూజలు అందుకుంటున్నవో నర్మద యందలి శిలలు, త్రినేత్రముల, యజ్ఞోపవీతముల చిహ్నములతో నర్మదబాణములుగా ప్రసిద్ధి పొంది శిష్టుల పూజా పీఠములను శివ స్వరూపంతో అలంకరిస్తున్నాయి. "గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు" పై శ్లోకంలో ఉన్న ఏడు నదుల పేర్లు స్మరించుకోవాలని మన పెద్దలు చెబుతారు. బృహదీశ్వరాలయంలోని అతిపెద్ద బాణలింగం ఇక్కడ లభించిందే. 

జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు నర్మదా తీరమందే సన్యాసదీక్ష తీసుకున్నారు. వారు రచించిన దివ్య స్తోత్రములలో 'నర్మదాష్టకం' ప్రసిద్ధమయినది. కార్త వీర్యార్జునుడు రాజధానిగా చేసుకొని నర్మదా నదీ ప్రాంతలను పరిపాలించినట్లు పురాణ గాథలు కలవు. నర్మదా బాణలింగాన్ని ప్రతి సోమవారం గాని, శివరాత్రి పర్వదినాలలో మరియు ప్రత్యేకమైన రోజులలో పూజా మందిరంలో ప్రతిష్టించటానికి ముందుగా నర్మదా బాణలింగాన్ని పవిత్ర నదీ జలాలతో గాని, పసుపు నీటితో గాని శుభ్రపరచి అమ్మవారి స్వరూపమైన పానపట్టం పైన ప్రతిష్ఠించాలి. ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనం, అభ్యంగన స్నానం, వస్త్రం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, నీరాజనం, తాంబూలం, నమస్కారం, ఉద్వాసన అనే షోడశోపచారాలతో లింగార్చన చేసిన వారికి కుజ దోషాలు, నాగదోషాలు, బంధన యోగం, పితృదోషం, కాలసర్పదోషాల నుండి విముక్తి కలుగుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...