12, జూన్ 2017, సోమవారం

జాతక చక్రంలో రోగ పరిశీలన

జాతక చక్రంలో రోగ పరిశీలన
మానవుని జీవితంలో రుగ్మతలు సర్వ సాధారణం . ఆ రుగ్మతలకు కూడా రాశులు , వాటి అధిపతులైన గ్రహాలు కారణం అవుతాయి. రాసి తత్వాలు ,గ్రహకార కత్వాల ద్వారా రోగ నిర్ధారణకు ఉపకరించేదే వైద్య జ్యోతిషం . ఏ శరీర భాగాలకు రుగ్మతలు వస్తాయో రాశులు తెలుపుతాయి. ఎటువంటి రుగ్మతలు వస్తాయో గ్రహాల ద్వారా తెలుస్తుంది ..ఏ గ్రహానికి సంబందించిన అవయవానికి వ్యాది సోకిందో ఆ గ్రహానికి సంబందించిన వైద్య విధానం ద్వారా మందు వాడితే తొందరగా వ్యాది నయమవుతుంది.


రాశులు - వాటికి వర్తించే శరీర భాగాలు

రాశులు - మేషం - శిరస్సు ,ముఖం, మెదడు , ముఖంలోని ఎముకలు, మెదడు లోని నరాలు, వృషభం - గొంతు, మెడ, వాటిలోని నరాలు,ఎముకలు. మిధునం - భుజాలు, చేతులు, వాటిలోని ఎముకలు, నరాలు, శ్వాస కోశం . కర్కాటకం- రొమ్ము ,జీర్ణాశయం. సింహం - గుండె , వెన్నెముక.

కన్య - ఉదరం, ఉదరకోశం,పొత్తికడుపు ,తుల - కటి భాగం, నాభి, మూత్ర పిండాలు. వృశ్చికం - జననేంద్రియాలు, మూత్రకోశం . ధనుస్సు - తొడలు, పిరుదులు, రక్త నాళాలు. మకరం - మోకాళ్ళు, కీళ్ళు., కుంభం - పిక్కలు, కాళ్ళు, రక్త ప్రసరణం. మీనం - పాదాలు, వేళ్ళు, శరీరంలోని ద్రవ పదార్దాలు.

ఈ రాశులలో మేష, సింహ, ధనుస్సులు అగ్నితత్వానికి, వృషభ, కన్య, మకరాలు భూతత్వానికి, మిధున , తుల, కుంభ రాశులు వాయు తత్వానికి , కర్కాటక, వృశ్చిక, మీన రాశులు జల తత్వానికి చెందినవి. కావున ఈ తత్వానికి సంబందించిన రుగ్మతలు కూడా వచ్చే అవకాశం ఉంది.వీటితో పాటు గ్రహాలు కూడా కొన్ని రుగ్మతలకు కారణం అవుతాయి .

గ్రహాలు ఆ కలుగ చేసే రుగ్మతలు

. గ్రహాలు - రుగ్మతలు సూర్యుడు - హృదయ , నేత్ర సంబంధ వ్యాదులు, రక్త ప్రసరణ ,వెన్నెముక సంబందిత వ్యాధులు, శరీరంలో శక్తి హీనత, పురుషులకు కుడి కన్ను ,మహిళలకు ఎడమకన్ను.

చంద్రుడు - ద్రవ సంబంధ మైన రుగ్మతలు, పైత్యం, దగ్గు, రొమ్ము, ఉదర వ్యాధులు, ఆస్తమా , పురుషులకు ఎడమ కన్ను, స్త్రీలకు కుడి కన్ను , మానసిక రుగ్మతలు.

బుధుడు - జీర్ణాశయం, నరాలు, ఊపిరితిత్తులు, మూగ, చేతులు,నాలుక, నోటికి సంబందించిన రుగ్మతలు, మూర్చ వంటి మానసిక వ్యాధులు.

శుక్రుడు - జననేంద్రియ రుగ్మతలు, గొంతు, మెడ, బుగ్గలు, చర్మ వ్యాధులు.

కుజుడు - నుదురు, శిరస్సు, ముక్కు, కండరాలు, పురుష జననేంద్రియాలు, మొలలు, రక్త స్రావం, గాయాలు, ఉష్ణ వ్యాధులు, అగ్ని, విద్యుత్ ప్రమాదాలు.

గురువు - కాలేయం, మధుమేహం,రక్త నాళాలు, కుడిచెయ్యి, తొడలు, పిరుదులు.

శని - దంతాలు, ఎముకలు, మోకాళ్ళు, కీళ్ళ సంబంధిత నొప్పులు, చర్మ వ్యాధులు.

మన శరీర భాగాలలో ఏ భాగం ఏ వ్యాధికి గురవుతుందో లగ్న, సూర్య , చంద్ర రాశులను, వాటి అధిపతులను బట్టి నిర్దారించు కోవచ్చు .లగ్న రాశి నుంచి గాని , సూర్య రాశి నుంచి గాని ,చంద్ర రాశి నుంచి గాని 6 ,8 ,12 స్థానాలు అనారోగ్య స్థానాలు అంటే ఆ రాశులు , ఆ రాశి అధిపతులు ,ఆ రాశిలో వున్నా గ్రహాలూ ,కారకత్వాలను తెలుసు కుంటే రోగ నిర్ధారణ సాధ్యమవుతుంది.

జాతకంలో లగ్నాదిపతి,లగ్నభావం షష్టాధిపతి,షష్ఠ బావంతో సంబందం ఉన్నయెడల జాతకునికి రోగాలు అడపాదడపా పీడిస్తాయని,ఒక రోగం తరువాత ఇంకో రోగం పీడిస్తూనే ఉంటుంది.వ్యాధి వచ్చిన తరువాత చికిత్స చేసి నయం చేయడం కన్నవ్యాధి రాకుండా చేసుకోవటమే మేలు అని జ్యోతిర్వైద్యం చెబుతున్నది.

రోగ నివారణ కేవలం మందులు వాడటం వలన సాద్యమనుకుంటే పొరపాటే.ఆహారపు అలవాట్లు మార్చుకోవటం వలన,వాతావరణం,నీరు మార్చటం వలన, రత్నధారణ వలన,జప దాన హోమాదుల వలన,ఔషదాల వలన,మంత్రోచ్ఛారణ వలన,కాస్మిక్ కిరణాల ద్వారా,కలర్ ధెరపీ ద్వారా,అయస్కాంత వైద్య చికిత్స విధానాల ద్వారా రోగాన్ని నివారించుకోవచ్చును,ముఖ్యంగా ఆదిత్య హృదయం,విష్ణు సహస్త పారాయణం, దుర్గాసప్తశ్లోకి,సుందరకాండ పారాయణం ప్రతి రోజు చేసే వారికి రోగాలు దరిచేరవు.

అగ్నితత్వ రాశులైన మేషం,సింహం,ధనస్సు లగ్నాలై 6 వ భావంతో సంభందం ఉన్న రోగం వచ్చిన తట్టుకోగలరు.రోగనిరోదక శక్తి కలిగి ఉంటారు.

భూతత్వ రాసులైన వృషభం,కన్య,మకరం లగ్నాలై 6 వ భావంతో సంబందం ఉన్న రోగం వచ్చిన కొంతవరకు తట్టుకోగలరు.వైద్యం చేయించుకుంటే రోగం నయమవుతుంది.

వాయుతత్వ రాశులైన మిధునం,తుల,కుంభ లగ్నాలై 6 వ భావంతో సంబందం ఉన్న కుంభ రాశి మినహా మిగతా రెండు రాశుల వారికి రోగం తొందరగా నయమవ్వదు.

జలతత్వ రాశులైన కర్కాటకం,వృశ్చికం,మీన లగ్నాలై 6 భావంతో సంబంధం ఉన్న వీరికి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది.సులభంగా రోగాలకు లొంగిపోతారు.

లగ్నం శరీరం,6 వ భావం రోగ స్ధానం,6 వ భావానికి వ్యయ స్ధానం పంచమం.పంచమం 6 వ భావానికి వ్యయం కాబట్టి రోగాన్ని నాశనం చేస్తుంది.4 వ భావం రోగాన్ని వృద్ది చేస్తుంది.6 వ భావంతో ఏర్పడిన రోగం 5 వ భావంతో రోగాలను వదిలించుకోచ్చును.లగ్నభావం 5,6 భావాలతో సంబందం ఉంటే రోగం వచ్చిన తగ్గించుకోవచ్చు.

లగ్నం 6 వ భావం కంటే 5 వ భావంతో బలంగా ఉంటే రోగాలు దరిచేరవు.లగ్నం,5 వ భావం బలంగా ఉంటే రోగం వచ్చిన పరిహార క్రియల ద్వారా రోగ నివారణ చేసుకోవచ్చు.మేషాదిగా రవి 5 వ రాశియైన సింహా రాశికి అధిపతి కనుక ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం తరువాత సూర్యాస్తమయం ముందు “ఆదిత్య హృదయం”సూర్యునికి ఎదురుగా నిలబడి చదివితే రోగ నివారణ జరిగి చాలా మంచి ఆరోగ్యం కలుగుతుంది.

లగ్నభావం 4 వ భావంతో సంబంధం ఉంటే రోగం నయమవటం కష్టం.ఎందుకంటే 6 వ భావానికి 4 వ భావం 11 వ భావం ఉపచయం కాబట్టి.ఉపచయం అంటే అబివృద్ధి.రోగాన్ని వృద్ధి చేస్తుంది.

శని,కుజ,రాహువులు రోగాన్ని పెంచితే ,రవి,గురువు లు రోగాన్ని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటాయి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...