15, జులై 2016, శుక్రవారం

గోవింద సాలగ్రామం

 గోవింద సాలగ్రామం
 
గోవింద సాలగ్రామం బూడిద వర్ణం లేదా నలుపు వర్ణం కలిగి అండాకృతి రూపం కలగి ఉర్ద్వ ముఖం నందు నామాకృతి కలిగి ఉన్న గోవింద సాలగ్రామం అనబడును. గోవింద సాలగ్రామాన్ని “ఓం గోవిందాయ విద్మహే గోపి వల్లభాయ ధీమహీ తన్నో కృష్ణ ప్రచోదయాత్” అనే మంత్రంతో పూజాచేసిన వారికి పశు సంపద, భూసంపద, ధన దాన్యాదులు పుష్కలంగా ఉండును. రియల్ ఎస్టేట్ వారు పూజించిన ఊహించని దనాభివృద్ధి కలుగుతుంది. గోవింద సాలగ్రామం ఉన్న ఆర్ధిక పురోగతి కల్పిస్తుంది. గోవింద సాలగ్రామం చూసిన మాత్రము చేతనే ఆత్మ విశ్వాసం పెరిగి మనస్సులో ఉన్న భయాలు బాధలు తొలగిపోతాయి.


గోవింద సాలగ్రామాన్ని పూజించటానికి ఉత్తమమైన సమయం కార్తీక మాసం, గోవింద సాలగ్రామాన్ని పరిశుభ్రమైన గంగాజలంతో గాని, సముద్రపు నీటితో గాని ఒకరోజు మొత్తం జలావాసం గావించాలి.  ఉదయాన్నే స్నానం అనంతరం సాలగ్రామాన్ని పవిత్రమైన మనస్సుతో నమస్కరించి పూజా మందిరంలో దీపం వెలిగించాలి. పంచ పాత్రలోని నీటితో శిరస్సుపైన చల్లుకొని “ఓం కేశవాయ స్వాహా” “ఓం మాదవాయ స్వాహా”____24 కేశవనామాలతో  ఆచమనం చెయ్యాలి.

సాలగ్రామ అర్చనా ద్రవ్యాలను సిద్దం చేసుకొని పూలు చేతిలో పట్టుకొని సాలగ్రామం పైన ఉంచవలెను. “ఓం గోవిందాయ విద్మహే గోపి వల్లభాయ ధీమహీ తన్నో కృష్ణ ప్రచోదయాత్” అనే విష్ణు గాయత్రి మంత్రాన్ని 11 సార్లు జపించాలి. సాలగ్రామంపైన తులసీ దళాలను ఉంచి ఉపచారార్ధంగా సాలగ్రామాన్ని ఆవాహనం చేసుకొని పూజా స్ధానంలో స్ధాపించుకోవాలి. పంచామృతాలైన పాలు, పెరుగు, నెయ్యి, తేనె, శర్కముతో పంచామృత స్నానంతో అభిషేకించవలెను. తరువాత నారికేళంతోను, కలశ శుద్ద జలంతోను అభిషేకం చేయాలి. సాలగ్రామం ముందు ఏదైనా బంగారు ఆభరణాన్ని ఉంచి పూలు, గంధం, పసుపు కలిపిన అక్షితలు మాత్రమే  ఉంచాలి. అర్చనకు లక్ష్మీ తులసిని ఉపయోగించవలెను. విష్ణుమూర్తి ద్వాదశ నామాలను ఒక్కొక్కటి చదువుతూ పూలు, అక్షితలు సమర్పించవలెను. ధూప, దీపములు మరియు ఉద్దరిణితో నీళ్ళు జూపి పళ్ళెములో నీళ్ళు విడువవలెను. నైవేద్యం సమర్పించి నివేదన చేయవలెను. తాంబూలం సమర్పించి లేచి ఆత్మ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవలెను. పంచామృత అభిషేక జలాన్ని శంఖంతో  తీర్ధంలా తీసుకొనవలెను. ముందుగా తులసి పత్రాన్ని ప్రసాదంగా తీసుకొని పిదప తక్కిన ప్రసాదాలను స్వీకరించవలెను. “ఓం నమోభగవతే  విష్ణవే శ్రీ సాలగ్రామ నివాసినే సర్వాబీష్ట ఫలప్రదాయ సకల దురిత నివారణే  సాలగ్రామాయ స్వాహా” అనే మంత్ర ద్యానం చేసుకుంటూ సాలగ్రామానికి నమస్కరించవలెను. సాలగ్రామాన్ని పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. సాలగ్రామాలకు ఎప్పుడు అభిషేకం జరుగుతూ ఉండే విధంగా అభిషేక పాత్ర నందు ఉంచాలి.

         ఋతుదర్మ కారణంగా సాలగ్రామాలకు స్త్రీస్పర్శను నిషేదించారు గాని మరో విధమైన కారణం లేదు. స్త్రీలు సాలగ్రామాన్ని అంటకుండా పూజాది కార్యక్రమాలను నిర్వహించవచ్చును. నిజమైన సాలగ్రామాలు ఇంటిలో ఉండటం ఎంతో మంచిది. సాలగ్రామ పూజ అందరికి అచ్చిరాదనే మూడనమ్మకం చాలా మందికి ఉంది. అందుకే చాలా మంది దేవాలయాలకు ఇచ్చేస్తారు.  ఆలయాల్లోగాని, ఇండ్లల్లో గాని పంచాయతనంలో నిత్యాభిషేకం సాలగ్రామ శిలకే చేస్తారు.

విష్ణువు కి ఉన్న నామాలలో గోవింద నామం ఒకటి. పరమాత్మ కున్న పేరు నారాయణ, అది ఒక పెద్ద సాగరం లాంటిది, అందులోంచి తేలిన ఒక నామమే గోవింద నామం. భగవంతుడు అవతరించి సంపాదించుకున్న నామం “గోవింద” నామం. అందుకే మన వాల్లు ఏదైన పని చేసే ముందు శ్రీ గోవింద గోవింద గోవింద అంటూ సంకళ్పం చేసుకొని కార్యంలోకి ఉజ్యమిస్తారు. ఈ నామం కృష్ణావతారానికి ప్రత్యేకం.

గోవింద నామం చెప్పేటప్పుడు రెండు మాటలు వాడతారు సాధారణంగా "గోపికా జీవన భాగ్యం గోవిందా గోవింద" అంటారు. గోపికా జీవన భాగ్యం - గోపికలందరూ తమ జీవితమునందు భాగ్యముగా భావించినది. గోవిందా గోవింద అంటారు కృష్ణ నామం చెప్పరు. కృష్ణుడే గోవిందుడు. ఇరువురికీ అబేధం. ఎప్పుడైనా సభలో భజన చేయించవలసి వస్తే గోవింద నామం చెప్పవలసి వస్తే ఈ మాట చెప్తారు. అలాగే రెండవది సర్వత్ర గోవింద నామ స్మరణం అంటారు. గోవింద నామాన్ని ప్రచారం చేసినటువంటి వారు శంకర భగవత్పాదుల వారు. అందరూ అన్ని వేళలా స్మరించండి గోవింద నామం మనుష్యుల జీవితం కొరకు ఉద్ధారకమైనటువంటిది. లోపల ఆ నామం ఉద్ధరణ కల్పిస్తుంది. ఆ నామమునకు ఉన్నటువంటి శక్తి ఏమిటంటే మనస్సు తేలికగా వెళ్ళి నిలబడేటటువంటి రూపాన్ని ఆవిష్కరిస్తుంది. గోవిందా అని పిలిచినప్పుడు వెంటనే పలికేది జగద్గురు స్వరూపమైన కృష్ణుడు.

ఇంద్రుడు దేవతల అధిపతి, పరమ గర్విష్టి. ఇంద్రయాగం అని చేస్తుండేవారు గోకులంలో పెద్దలు. వానలు ఇచ్చేవాడు ఇంద్రుడని వారి విశ్వాసం. ఒకరోజు గోకులంలో పెద్దలంతా ఇంద్రయాగం తలపెట్టారు. అందరూ ఇంద్రుడికి అర్పించటానికి పదార్థాలను తయారుచేస్తున్నారు. అయితే కృష్ణుడి ఇదేంటో తెలుసుకోవాలని కూతుహలపడి, పెద్దలని ఆడిగాడు. అయితే వారు వర్షాలు ఇచ్చే వరణుడు, ఇంద్రుడి ఆదీనంలోనే ఉంటాడుకదా, ఆ వర్షాలు వస్తేనేకదా మనకు పంటలు పండుతాయి, గోవులకు ఆహారం లభిస్తుంది. ఆ గోవుల పాడిపై మన జీవనం ఆధారపడి ఉంది అందుకే చేస్తున్నాం అని చెప్పారు. అయితే ఇంద్రుడు దేవతల అధిపతి, ఒక ఉద్యోగి, ఇలాంటివారెందరో తన ఆధీనంలో పని చేస్తున్నవారు ఉన్నారు ఈ విశ్వం యొక్క స్థితి కోసం. అలాంటిది తాను ఇక్కడే ఉంటుంటే తనను మరచిపోయి, ఆ ఇంద్రుడి కి చేయటం ఏంటీ, ఆ ఇంద్రుడు ఇవ్వాలన్నా తాను వెనకనుండి ఇస్తేనేకదా, ఇవ్వగలడు అని, ఆ ఇచ్చేవాన్ని నేనిక్కడే ఉండగా నన్ను కాదని చేస్తున్నారే అని శ్రీకృష్ణుడు అనుకున్నాడు.

వాల్లకందరికి ఈ విషయం ఎలాగో తెలుపాలి అని అనుకుని, అందరినీ ఒక దగ్గరికి చేర్చి, వానలు ఇచ్చేది ఇంద్రుడా కాదు, సూర్యుని శక్తికి సముద్రంలోని నీరు మేఘాలుగా మారితే, ఆపై గాలివీస్తె మన దగ్గరకు వచ్చాయి, ఆ గోవర్థన పర్వతం అడ్డుకోవడంచే మనకు వర్షంగా వస్తుంది. మనం గోవర్థన పర్వతానికే ఈ పదార్థాలను అర్పించి కృతజ్ఞత తెలుపుకోవాలి అని విన్నపించుకున్నాడు. అందరికి సభబే అనిపించి అందరూ ఆ గోవర్థన పర్వతానికే పదార్థాలను సమర్పించారు. తనే పర్వతంలో ఆవేశించి, నైవేద్యం పుచ్చుకున్నాడు. ఇంద్రుడికి పదార్థాలు అందకపోవడంచే ఆగ్రహించి ఏడు రోజులు వరుసగా రాల్ల వాన కురిపించాడు. ఇదిగో మనం చేసిన తప్పుకి ఇంద్రుడు ఆగ్రహించాడు, కన్నయ్యా అని అందరూ కృష్ణున్ని చేరగానే, మనం  ఆరగింపు ఇచ్చిన ఆ కోండే మనల్ని కాపాడదా ఏం అంటూ ఒంటి వ్రేలితో కొండను ఎత్తి అందరిని రక్షించాడు. గోవర్థనోద్దారి అయ్యాడు ఆయన. ఇంద్రుడు తనకని అర్పించినవి తానే తినాలి అనుకున్నాడు, ఆ ఇంద్రుడిలోనూ ఉండేవాడు కృష్ణుడేకదా, అదే శ్రీకృష్ణార్పణ మస్తూ అని అనుకునేవాడైతే అన్ని పదార్థాలు ఉండేవి, నేనే తింటున్నాను, నాలోని పరమాత్మకు కాదు అని భావించాడు కాబట్టే ఇంద్రుడికి బుద్ది చేప్పే పరిస్థితి కల్పించాడు కృష్ణుడు.

ఏడు రోజులు గోవర్దన పర్వతాన్ని ఎత్తి పట్టి గో గోప గోపీ జన సంరక్షణ చేసి, ఇంద్రుడిచే గోవింద పట్టాభిషేకం చేయించుకున్నాడు. కష్టపడి సంపాదించిన నామం అవడంచే ఆ నామంతో పిలవడం ఆయనకు చాలా ఇష్టం.
 మనం నిద్రించేటప్పుడు చెడు కలలు, భయాలు కలగకుండా ఉండటానికి గోవింద నామం చదువుకుంటే దోషం పోతుందని పురాణ వచనం. “గో” అనగా వాక్కులు, వేద మంత్రాలు, భూమి ఆయనను ఆశ్రయించి ఉన్నాయి కనుక గోవిందుడు అయ్యాడు. గోవింద నామాన్ని భోజన సమయంలో, క్రీడా సమయంలో స్మరించటం ఉత్తమం. గో శబ్దము పృథ్విని, గోవులను కూడా సూచిస్తుంది. శ్రీ మహావిష్ణువు అనంతము, పాపరహితము ఐన ధరణిని పొందినవాడు. దేవతలకు, గోవులకు ఇంద్రుడు, అందుకు ఆయనను గోవిందుడని కీర్తిస్తారు. గోవు శబ్దంచేత ఒక వాక్కు కూడా చెప్పబడినది. ఆవాక్కును ప్రాప్తింపచేసేవాడు కాబట్టి గోవిందుడు. ఈ విశ్వములో గోవులుగా చెప్ప బడేవన్నీ జీవాత్మలు. జీవులు పొందే శాశ్వతమైన ఆనందము ఇచ్చేవాడు కావున గోవిందుడు. వాక్కులను వేదవాక్కులుగా పరిగణిస్తే వేదముల వలన లభించువాడు గోవిందుడని చెప్పుకోవచ్చును.
  గోవింద సాలగ్రామం:-3500.00




పై  గోవింద సాలగ్రామం కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో  వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.


Bank Details:- State Bank Of Hyderabad ; Name:-N.Raja Sekhar ; A/c No:-52207626721, Place :-Hyderabad, IFSC Code:-SBHY0021056.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...